Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ ప్రతీ యేడాది హిందూ కాలండర్ ప్రకారం వైశాఖ మాస శుద్ధ తృతీయ రోజు వస్తూ ఉంటుంది. ఈ రోజు పరశురాముడి జయంతి. మరోవైపు సింహాచలంలో అప్పన్న స్వామి నిజ రూప దర్శనం ఇచ్చే రోజు. ఇలాంటి అద్భుతమైన రోజున అరుదైన ఆరు యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
Akshaya Tritiya 2025: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, దాదాపు 100 యేళ్ల తర్వాత, అక్షయ తృతీయ నాడు ప్రత్యేక రాజయోగాలు కలిసి ఏర్పడుతున్నాయి. ఈ యేడాది అక్షయ తృతీయ ఏప్రిల 30వ తేదిన వస్తుంది. ఈ రోజున ఆరు అద్భుత యోగాలు సిద్ధించబోతున్నాయి.
ఈ రోజున బలమైన గజకేసరి రాజయోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, మాళవ్య రాజయోగం, చతుర్గ్రాహీ యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం ఏర్పడుతున్నాయి. దీని వలన మూడు రాశుల వారికి కుబేర సంపద లభిస్తుంది.
మకర రాశి: మకర రాశి వారికి అక్షయ తృతీయ నాడు ఏర్పడే అరుదైన రాజయోగాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి చేస్తోన్న పనిలో ప్రమోషన్లు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశీ వాణిజ్యం నుండి భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఇంట్లో ధన ప్రవాహం అధికంగా ఉండే అవకాశం ఉంది. జీవితంలో సుఖాలు, సౌకర్యాలు గతంలో కంటే పెరుగుతాయి.
సింహ రాశి: అక్షయ తృతీయ నాడు సింహా రాశి అనుకోని ప్రయోజనాలు దగ్గబోతున్నాయి. ఈ రాశి ఉద్యోగ స్త్రీ, పురుషులకు ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలను అందుకుంటారు. సమాజంలో మీ హోదా కూడా పెరుగుతుంది.
తుల రాశి: అక్షయ తృతీయ నాడు తుల రాశి వారికి బంగార మయంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలను తీసుకురాబోతుంది. ఇది జీవితంలో మీరు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి దోహద పడుతుంది. మీ కెరీర్, వ్యాపారంలో సానుకూల మార్పుల కారణంగా మీరు కుబేరుని ఆశీస్సులతో గతంలో కంటే ఐశ్వర్యవంతులు అవుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్యులు, పండితులు, సనాతన హిందూ ధర్మశాస్త్రల నుంచి స్వీకరించి అందించినది. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.