Nikita Dutta tests covid positive: బాలీవుడ్ నటి నికితా దత్త కరోనా బారిన పడింది. తన తల్లికి కూడా కరోనా సోకిరందని నటి ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసింది.
దేశంలో మరోసారి కరోనా మహామ్మారి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే టాలీవుడ్ హీరో మహేష్ బాబు సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి కరోన దేశంలో అందర్ని టెన్షన్ కు గురిచేస్తుంది.
ఈ క్రమంలో తాజాగా.. మరో బాలీవుడ్ నటి నికితా దత్త ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టింది. తాను.. కరోనా బారిన పడినట్లు చెప్పుకొచ్చింది.తనతో పాటు.. తన తల్లికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని పోస్ట్ పెట్టింది. ఇద్దరం కూడా క్వారెంటైన్ లో ఉన్నట్లు నటి పోస్ట్ లో తెలియజేసింది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కరోనా సోకకుండా.. ముందు జాగ్రత్తలు పాటించాలని కూడా నటి సూచనలు చేసింది. మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా సానిటైజర్ లతో చేతులు శుభ్రంగా కడుక్కొంటు ఉండాలని నటిసూచించింది.
ఇదిలా ఉండగా.. శిల్పా శిరొద్కర్ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నట్లు కూడా మరల పోస్ట్ చేసింది. అయితే... ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా గతంలో వ్యాప్తి చెందినంత డెంజరెస్ వేరియంట్ కాదని నిపుణులు చెబుతున్నారు.
అయిన కూడా.. కరోనా సోకిన తర్వాత బాధపడేదాన్ని కన్నా.. రాకుండా జాగ్రత్తలు తీసుకొవాలని, రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ లను తింటు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇండస్ట్రీలో కరోనా అందర్ని టెన్షన్ పెట్టిస్తుంది.